15 ఓవర్లకు 100 కూడా దాటని ముంబై స్కోరు
ABN, First Publish Date - 2021-04-24T02:17:07+05:30
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడుతోంది. తొలి రెండు వికెట్లు త్వరగా పడపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. 15 ఓవర్లు..
చెన్నై: పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడుతోంది. తొలి రెండు వికెట్లు త్వరగా పడపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. 15 ఓవర్లు పూర్తయినా కనీసం 100 పరుగులు కూడా ముంబై జట్టు చేయలేదంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోండి. ఓపెనర్ క్వింటన్ డీకాక్(3), ఇషాన్ కిషన్(6) వెంటనే అవుటైనా కెప్టెన్ రోహిత్ శర్మ(60: 46 బంతుల్లో.. 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తనపై వేసుకున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్(27: 22 బంతుల్లో.. 3 ఫోర్లు) అతడికి అండగా నిలుస్తున్నాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ముంబై జట్టు 2 వికెట్లకు 97 పరుగులు చేసింది.
Updated Date - 2021-04-24T02:17:07+05:30 IST