తస్లీమాపై పరువు దావా నష్టం వేయనున్న మొయిన్ అలీ!
ABN, First Publish Date - 2021-04-07T19:51:06+05:30
తస్లిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొయిన్ అలీ భావిస్తున్నాడు.
`మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు` అంటూ ట్విటర్లో సంచలన కామెంట్స్ చేసిన బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ తీవ్ర విమర్శలను ఎందుర్కొంటోంది. నెటిజన్లు, క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికులు తస్లిమాపై దుమ్మెత్తి పోస్తున్నారు. తస్లిమా వ్యాఖ్యాలపై మొయిన్ అలీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తస్లిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొయిన్ అలీ భావిస్తున్నాడు.
తస్లిమాపై పరువు నష్టం దావా వేసేందుకు మొయిన్ అలీ సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు అతని టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. `తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్యలు మొయిన్ అలీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి. అందుకే మా లాయర్తో చర్చించి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతాం. త్వరలోనే కోర్టును ఆశ్రయించనున్నాం. ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడినందుకు తస్లీమాపై పరువు నష్టం దావా వేయనున్నామ`ని అలీ మేనేజ్మెంట్ కంపెనీ ఎసెస్ మిడిల్ ఈస్ట్ పేర్కొంది.
Updated Date - 2021-04-07T19:51:06+05:30 IST