సన్రైజర్స్కు కీలక ఆల్రౌండర్ దూరం
ABN, First Publish Date - 2021-04-01T01:41:05+05:30
మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంరంభం కానున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి దెబ్బ తగిలింది. కీలక ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ జట్టుకు దూరమవుతున్నట్లు..
ఇంటర్నెట్ డెస్క్: మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంరంభం కానున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి దెబ్బ తగిలింది. కీలక ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ జట్టుకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. ‘బయోబబుల్ వాతావరణంతో విసిగిపోయా.. అందుకే ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గొనలేను’ అని హైదరాబాద్ ఫ్రాంచైజీకి మిచెల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా.. మిచెల్ మార్ష్ గత సీజన్ ఐపీఎల్లో ఆడినప్పటికీ.. గాయం కారణంగా సగం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ సారి పూర్తి టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సన్రైజర్స్కు భారీ దెబ్బ తగిలినట్లైంది.
కాగా.. సన్రైజర్స్ కీలక బ్యాట్స్మన్, న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఇటీవల జరిగిన ఆసీస్ టోర్నీలో గాయపడ్డాడు. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో ఆడతాడా..? లేదా..? అనే విషయం అనుమానంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై కేన్ కానీ, సన్రైజర్స్ ఫ్రాంచైజీ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఈ మధ్యనే జట్టుతో చేరాడు.
Updated Date - 2021-04-01T01:41:05+05:30 IST