Tokyo Olympics: టేబుల్ టెన్నిస్లో మనికా బత్రా శుభారంభం
ABN, First Publish Date - 2021-07-24T20:59:00+05:30
ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో మనికా బాత్రా శుభారంభం చేసింది. టోక్యో
టోక్యో: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో మనికా బాత్రా శుభారంభం చేసింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాజియంలో గ్రేట్ బ్రిటన్కు చెందిన టిన్-టిన్తో జరిగిన పోరులో వరుస సెట్లలో విజయం సాధించింది. 30 నిమిషాలపాటు జరిగిన నాలుగు గేముల్లో వరుసగా 11-7, 11-6, 12-10, 11-9తో విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకుంది. కాగా, టోక్యోలో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. వెయిట్ లిఫ్ట్ మీరాబాయి చాను రజత పతకం సాధించింది. అర్హత పోటీల్లో సత్తా చాటిన యువ షూటర్ సౌరభ్ చౌదరి.. రెండో ఎలిమినేషనల్లో ఏడో స్థానంలో నిలిచి పోటీల నుంచి నిష్కృమించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో హాకీ పురుషుల జట్టు 3-2తో విజయం సాధించింది.
Updated Date - 2021-07-24T20:59:00+05:30 IST