సన్రైజర్స్పై కోల్కతా గెలుపు
ABN, First Publish Date - 2021-04-12T04:48:19+05:30
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. 188 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ను కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఓవర్లోనే..
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. 188 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ను కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఓవర్లోనే భారీ దెబ్బ కొట్టాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(3)ను అవుట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఆ తరువాతి ఓవర్లో స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ కూడా మరో ఓపోనర్ వృద్ధిమాన్ సాహా(7)ను క్లీన్ బౌల్డ్ చేసి ఎస్ఆర్హెచ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మనీష్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్ స్టో(55: 40 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని కట్ చేయబోయిన బెయిర్ స్టో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రాణా చేతికి చిక్కాడు. దీంతో వారిద్దరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
కాగా.. అంతకుముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చక్కటి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లే పూర్తయిన తర్వాత గిల్ అవుటైనా.. వన్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత దినేశ్ కార్తిక్(22 నాటౌట్: 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతా బ్యాట్స్మన్ ఎవరూ రాణించలేదు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, నబీలకు చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నటరాజన్లు చెరో వికెట్ దక్కింది.
ఇక ఆ తర్వాత మహ్మద్ నబీ(14), విజయ్ శంకర్(11)తో కలిసి మనీష్ పాండే ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. అప్పటికే చేయాల్సిన స్కోరు భారీగా పెరిగిపోయింది. మనీష్ పాండే చివరి వరకు నాటౌట్గానే నిలిచినా.. భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షకిబ్, కమిన్స్, రస్సెల్లు తలా ఓ వికెట్ తీశారు. దీంతో కేకేఆర్ టోర్నీలో బోణీ కొట్టింది. 80 పరుగులతో రాణించిన నితీశ్ రాణాకు మ్యాన్ ఆఫ్ ది మ్యచ్ దక్కింది.
Updated Date - 2021-04-12T04:48:19+05:30 IST