Kanpur Test: తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్
ABN, First Publish Date - 2021-11-26T18:05:46+05:30
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 345 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించింది. ఆట ఆరంభంలోనే సౌథీ బౌలింగ్లో జడేజా..
కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 345 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించింది. ఆట ఆరంభంలోనే సౌథీ బౌలింగ్లో జడేజా(112 బంతుల్లో 4 ఫోర్లతో 50) పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇక అరంగేట్రం టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ శతకం సాధించాడు. తనదైన స్టైల్లో 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌథీ వేసిన 96.1 ఓవర్లో విల్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ 105 పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ 38, సాహా 1, అక్షర్ పటేల్ 3, ఇషాంత్ శర్మ డకౌటయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 111.1 ఓవర్లలో 345 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలింగ్లో టీమ్ సౌథీ ఐదు వికెట్లు తీసుకోగా, జేమీసన్ 3, అజీజ్ పటేల్కు రెండు వికెట్లు దక్కాయి.
Updated Date - 2021-11-26T18:05:46+05:30 IST