నేనే ఓపెనర్నని కోహ్లీ చెప్పాడు...
ABN, First Publish Date - 2021-10-10T07:32:14+05:30
తమ జట్టు చివరి రెండు మ్యాచ్ల్లో మెరుపు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్.. టీమిండియా తరఫున కూడా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి.
ఇషాన్ కిషన్
అబుదాబి: తమ జట్టు చివరి రెండు మ్యాచ్ల్లో మెరుపు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్.. టీమిండియా తరఫున కూడా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. ఎందుకంటే స్వ యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమేరకు అతడికి హామీ ఇచ్చాడట. ఈ మధ్యకాలంలో ఫామ్ కోల్పోయిన ఇషాన్.. రాజస్థాన్పై 25 బంతుల్లో 50, సన్రైజర్స్పై 32 బంతుల్లో 84 పరుగులతో అదరగొట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున రోహిత్ అన్ని ఫార్మాట్లకు ఓపెనర్గా వ్యవహరిస్తుండగా టీ20ల్లో అతడికి జతగా రాహుల్, కోహ్లీ బరిలోకి దిగారు. ‘నాకు ఓపెనర్గా రావడమంటే ఇష్టం. విరాట్ కూడా అదే చెప్పాడు. టీ20 వరల్డ్క్పలో ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉండమన్నాడు. అయితే పెద్ద వేదికపై ఎదురయ్యే సవాల్ కోసం సమాయత్తంగా ఉండాల్సిందే’ అని ఇషాన్ తెలిపాడు.
Updated Date - 2021-10-10T07:32:14+05:30 IST