మా నగరాన్ని కూడా చేర్చండి
ABN, First Publish Date - 2021-03-01T09:50:20+05:30
రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు మాత్రం హైదరాబాద్లో ఐపీఎల్ను జరపాల్సిందిగా బీసీసీఐని కోరారు.
బీసీసీఐని కోరిన కేటీఆర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు మాత్రం హైదరాబాద్లో ఐపీఎల్ను జరపాల్సిందిగా బీసీసీఐని కోరారు. ‘దేశంలోని ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే మా దగ్గరే అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందుకే హైదరాబాద్ను కూడా వేదికల జాబితాలో చేర్చాలని కోరుతున్నా. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా ముందు హెచ్సీఏలో సమస్యలను పరిష్కరించండంటూ నెటిజన్లు కేటీఆర్ ట్వీట్కు స్పందించారు.
Updated Date - 2021-03-01T09:50:20+05:30 IST