సెప్టెంబరులో అమ్మాయిల ఆసీస్ టూర్!
ABN, First Publish Date - 2021-05-17T09:23:42+05:30
ఈ ఏడాది సెప్టెంబరులో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆసీస్ పేసర్ మెగాన్ స్కాట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టూర్ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుంది. ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ నిర్వహించే చాన్స్ ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఈ టూర్కు భారత్ వెళ్లాల్సింది, కానీ కరోనాతో వాయిదా వేశారు.
Updated Date - 2021-05-17T09:23:42+05:30 IST