వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ .. పుజారా డకౌట్
ABN, First Publish Date - 2021-12-26T22:49:22+05:30
దక్షిణాఫ్రికాతో జరుగతున్న తొలి టెస్టులో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ఈ ఉదయం బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి సెషన్లో నిలకడగా ఆడింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ సంయమనంతో ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించింది.
లంచ్ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 117 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు.
Updated Date - 2021-12-26T22:49:22+05:30 IST