Prithvi Shaw: ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ మిస్
ABN, First Publish Date - 2021-07-23T22:01:10+05:30
టీమిండియా ఓపెనర్ పృథ్వీషా మారోమారు అర్ధ సెంచరీ చేజార్జుకున్నాడు. 49 బంతుల్లో 8
కొలంబో: టీమిండియా ఓపెనర్ పృథ్వీషా మారోమారు అర్ధ సెంచరీ చేజార్జుకున్నాడు. 49 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసిన షా.. షనక బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే దాటిగా ఆడుతున్న సంజు శాంసన్ కూడా అవుటయ్యాడు. ఫలితంగా 118 వికెట్లకే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 46 పరుగులు చేసిన సంజు జయవిక్రమ బౌలింగులో అవిష్కకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిశాయి. ఇండియా మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
Updated Date - 2021-07-23T22:01:10+05:30 IST