ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనంద్‌ను మోసం చేసి గెలిచా!

ABN, First Publish Date - 2021-06-15T09:15:43+05:30

ఐదుసార్లు ప్రపం చ చాంపియన్‌గా నిలిచి న విశ్వనాథన్‌ ఆనంద్‌ను చారిటీ చెస్‌ గేమ్‌లో ఓ వ్యాపారవేత్త ఓడించాడు. దీంతో అందరూ అతడిపై ప్రశంసలు కురిపించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వ్యాపారవేత్త నిఖిల్‌ కామత్‌

న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపం చ చాంపియన్‌గా నిలిచి న విశ్వనాథన్‌ ఆనంద్‌ను చారిటీ చెస్‌ గేమ్‌లో ఓ వ్యాపారవేత్త ఓడించాడు. దీంతో అందరూ అతడిపై ప్రశంసలు కురిపించారు. కానీ అంతలోనే ఏమనుకున్నాడో.. ఏమో ఆ వ్యాపారి తన తప్పుని అంగీకరిస్తూ అసలు విషయం బయటపెట్టాడు. కంప్యూటర్‌తో పాటు ఇతరుల సహాయం తీసుకుని ఆనంద్‌ను ఓడించానని, ఇందుకు క్షమించాలని వేడుకున్నాడు. ఆదివారం వర్చువల్‌గా జరిగిన కొవిడ్‌-19 రిలీఫ్‌ చారిటీ మ్యాచ్‌లో ఆనంద్‌ పలువురు ప్రముఖులతో చెస్‌ ఆడాడు. ఇందులో భాగంగానే జెరోధా కంపెనీ సహ యజమాని నిఖిల్‌ కామత్‌తో పోటీ జరిగింది. ‘నేను నిజంగానే ఆనంద్‌ను ఓడించానని ఎవరైనా భావిస్తే అది పొరపాటే. బోల్ట్‌తో పోటీపడి 100మీ. రేస్‌ నెగ్గగలమా? ఇదీ అలాంటిదే. ఆనంద్‌పై గెలిచేందుకు నేను కంప్యూటర్‌, ఇతర నిపుణుల సహాయం తీసుకున్నాను. ఇది సరదా కోసం చేసినా ఇలా జరగకూడదు. అందుకు అందరినీ క్షమించాలని వేడుకుంటున్నా’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. అయితే చారిటీ ప్రోగ్రామ్‌లో ఇలా చేయడం శోచనీయమని చెస్‌ సమాఖ్య కార్యదర్శి భరత్‌ చౌహాన్‌ విమర్శించాడు.


Updated Date - 2021-06-15T09:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising