ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్డే చరిత్రలోనే అతి భారీ స్కోరు.. పృధ్వీషా డబుల్ సెంచరీతో..

ABN, First Publish Date - 2021-02-26T02:53:15+05:30

వన్డేల్లోనే అతి భారీ స్కోరు సాధించి ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా 450 పైగా పరుగులు చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. కెప్టెన్ పృధ్వీషా 152 బంతుల్లో 227 పరుగులతో(31 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీకి తోడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వన్డేల్లోనే అతి భారీ స్కోరు సాధించి ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా 450 పైగా పరుగులు చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. కెప్టెన్ పృధ్వీషా 152 బంతుల్లో 227 పరుగులతో(31 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(133: 58 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సులు)తో విజృంభించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 457 పరుగులు భారీ స్కోరు చేసింది. భారత గడ్డపై వన్డే చరిత్రలో ఇన్ని పరుగులు ఇంతవరకు ఏ జట్టూ నమోదు చేయలేదు. పృధ్వీషా, సూర్యకుమార్ ధాటికి ప్రత్యర్థి పుదుచ్చేరి బౌలర్లు విలవిల్లాడిపోయారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ అరుదైన ఘనత సాధించింది.


 ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆదిత్య తారే(56: 64 బంతుల్లో 7 ఫోర్లు) కూడా అర్థ సెంచరీతో రాణించాడు. ఇదిలా ఉంటే 458 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి 38.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్ప కూలింది. పుదుచ్చేరి తరపున డీ రోహిత్(63: 68 బంతుల్లో) ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు.

Updated Date - 2021-02-26T02:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising