ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Pak మ్యాచ్ టికెట్స్ కావాలని..

ABN, First Publish Date - 2021-10-09T22:26:53+05:30

యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ఐసీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇప్పుడు ఈ మ్యాచ్‌ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేలామంది అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు రెండు టికెట్లు ఇప్పించాలంటూ ఓ అభిమాని రోహిత్‌శర్మను వేడుకోవడం వైరల్ అయింది. 


ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (శుక్రవారం) యూఏఈలోని సేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ ప్రేక్షకుడు స్టాండ్స్ నుంచి రోహిత్ ఫొటోతో ఓ ప్లకార్డు ప్రదర్శించాడు.


టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ తలపడే మ్యాచ్‌ కోసం తనకు రెండు టికెట్లు కావాలని, ఎలాగైనా ఇప్పించాలంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. అతడు అలా ప్లకార్డు ప్రదర్శించాడో, లేదో వెంటనే అది కెమెరా సిబ్బంది కంటపడడంతో ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాకూ ఎక్కింది. ఈ నెల 17న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.  

Updated Date - 2021-10-09T22:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising