‘గోల్డ్’ కోట్టిన నీజర్కు ధోనీ జట్టులో స్పెషల్ జెర్సీ
ABN, First Publish Date - 2021-08-08T04:37:45+05:30
టోక్యో ఒలింపిక్స్కు భారత్లో తొలి బంగారు పతకం అందించాడు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీజర్ చోప్రా. ఒలింపిక్స్ ఒక్క బంగారు పతకం కూడా ..
టోక్యో ఒలింపిక్స్కు భారత్లో తొలి బంగారు పతకం అందించాడు జావెలిన్ త్రో క్రీడాకారుడు నీజర్ చోప్రా. ఒలింపిక్స్ ఒక్క బంగారు పతకం కూడా ఈ ఏడాది భారత్ ఇంటి ముఖం పడుతుందని అంతా భావించినా.. ఆ నిరాశను నీజర్ పటాపంచలు చేశాడు నీరజ్. అద్భుతమైన ఆటతో పసిడి పట్టేశారు. దీంతో దేశ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అతడికి ప్రత్యేక నజరానా ప్రకటించింది. హర్యానా ప్రభుత్వం కూడా భారీ బహుమతి ఇస్తామని వెల్లడించింది. భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కూడా ప్రత్యేకంగా అతడికి కోట్ల రూపాయల గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని ఓ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కూడా నీరజ్కు తమ జట్టులో ప్రత్యేక స్థానం కల్పించింది.
నీరజ్కు సీఎస్కే ఫ్రాంచైజీ రూ.కోటి అవార్డ్ ప్రకటించింది. అలాగే అతడి పేరున తమ జట్టు జెర్సీని కూడా ప్రకటించింది. ఆ జెర్సీపై 8758 నెంబరును ముద్రించనుంది. కాగా.. 23 ఏళ్ల నీరజ్ టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి పసిడి పట్టేసిన విషయం తెలిసిందే.
Updated Date - 2021-08-08T04:37:45+05:30 IST