దీపక్కు రజతం
ABN, First Publish Date - 2021-02-28T09:21:24+05:30
స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్కు షాకిచ్చి ఫైనల్కు దూసుకొచ్చిన భారత యువ బాక్సర్ దీపక్ కుమార్ తుదిపోరులో మాత్రం అదేజోరు చూపలేకపోయాడు...
న్యూఢిల్లీ: స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్కు షాకిచ్చి ఫైనల్కు దూసుకొచ్చిన భారత యువ బాక్సర్ దీపక్ కుమార్ తుదిపోరులో మాత్రం అదేజోరు చూపలేకపోయాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో శనివారం జరిగిన పురుషుల 52 కిలోల విభాగం ఫైనల్లో స్థానిక బాక్సర్, రెండుసార్లు యూరోపియన్ చాంపియన్ డానియల్ అసెనోవ్ చేతిలో దీపక్ ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత బాక్సర్ నవీన్ బూర 69 కిలోల సెమీస్ బౌట్లో బొబో ఉస్మాన్ బతురోవ్ (ఉజ్భెకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యానికి పరిమితమయ్యాడు.
Updated Date - 2021-02-28T09:21:24+05:30 IST