నీరజ్ చోప్రాపై బయోపిక్.. ఈ పసిడి వీరుడి అభిప్రాయం ఏంటంటే..
ABN, First Publish Date - 2021-08-09T20:58:09+05:30
నీరజ్ చోప్రా.. దేశంలో ప్రస్తుతం ఈ పేరే ట్రెండింగ్లో ఉంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడావిభాగంలో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించి, దేశ కీర్తిప్రతిష్టలను పతాకస్థాయికి చేర్చిన నీరజ్ను దేశ ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో.. సహజంగానే నీరజ్ బయోపిక్పై చర్చలు మొదలైయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: నీరజ్ చోప్రా.. దేశంలో ప్రస్తుతం ఈ పేరే ట్రెండింగ్లో ఉంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడావిభాగంలో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించి, దేశ కీర్తిప్రతిష్ఠలను పతాకస్థాయికి చేర్చిన నీరజ్ను దేశ ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు. నీరజ్కు ఆకట్టుకునే రూపురేఖలు ఉండటంతో సహజంగానే అతడి బయోపిక్పై కూడా చర్చలు మొదలైయ్యాయి. అయితే.. నీరజ్ బయోపిక్ గురించి చర్చ రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో జరిగిన ఆసియా, కామన్ వెల్త్ క్రీడల్లోనూ నీరజ్ బంగారు పతకాలను సాధించాడు. ఆ సమయంలో తొలిసారిగా నీరజ్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. దీనిపై అప్పట్లో ఓ జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్.. తన జీవితం ఆధారంగా ఓ బయోపిక్ నిర్మించడం అంటూ జరిగితే అందులో అక్షయ్ కుమార్ గానీ..రణదీప్ హుడా గానీ ప్రధాన పాత్రలో నటించాలని తనమనసులో మాటను బయటపెట్టాడు.
ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించడంతో మీడియా మరోమారు బయోపిక్ విషయాన్ని నీరజ్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే..తనకు ప్రస్తుతానికి ఇటువంటి ఆలోచన ఏదీ లేదని నీరజ్ స్పష్టం చేశాడు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా ఆటపైనే ఉంది. బయోపిక్ విషయంలో మరికొంత కాలం వేచి చూడాల్సిందే. నేను రిటైరయ్యాక..నా జీవితం ఆధారంగా సినిమా తీస్తే తీయచ్చు. నాకు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి, భారత కీర్తిప్రతిష్ఠలను కొత్త శిఖరాలకు చేర్చాలనుంది. రిటైరయ్యే నాటికి ఓ అథ్లేట్గా గౌరవాభిమానాలు, మరిన్ని విజయాలు సంపాదిస్తే.. నా గురించి చెప్పుకునేందుకు బోలెడన్ని విషయాలు ఉంటాయి’’ అని నీరజ్ కామెంట్ చేశాడు.
Updated Date - 2021-08-09T20:58:09+05:30 IST