Tokyo Olympics: సెమీస్కు చేరిన భజరంగ్ పునియా
ABN, First Publish Date - 2021-08-06T15:37:37+05:30
ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అద్భుతప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. పురుషుల 65కిలోల విభాగంలో క్వార్టర్స్లో 2-1 తేడాతో ఇరాన్కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు.
టోక్యో: ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. పురుషుల 65కిలోల విభాగం క్వార్టర్స్లో 2-1 తేడాతో ఇరాన్కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు. దీంతో భజరంగ్ సెమీస్కు చేరాడు. మొదటి రౌండ్లో భజరంగ్పై 0-1 తేడాతో ప్రత్యర్థి గియాసి పైచేయి సాధించిన.. రెండో రౌండ్లో అద్భుతంగా పుంజుకున్న భజరంగ్ మ్యాచ్ను తనపైపు తిప్పుకున్నాడు. 10 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా భజరంగ్ రెండు పాయింట్లు సాధించడంతో విజేతగా నిలిచాడు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సెకండ్ సెమీ ఫైనల్లో అజర్ బైజాన్ రెజ్లర్ హాజి అలీయెవ్తో తలపడనున్నాడు. ఇక్కడ గెలిస్తే భారత్కు మరో పతకం ఖాయమైనట్లే.
Updated Date - 2021-08-06T15:37:37+05:30 IST