ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిస్బేన్ టెస్ట్.. వికెట్ పడకుండానే..

ABN, First Publish Date - 2021-01-17T19:10:48+05:30

నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. సిరీస్ నిర్ణయాత్మకమైన టెస్ట్ కావడంతో.. అందరి దృష్టి పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఆసీస్‌కు టీమిండియా దీటైన జవాబిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. సిరీస్ నిర్ణయాత్మకమైన టెస్ట్ కావడంతో.. అందరి దృష్టి పడింది. తొలి రెండు రోజులు ఆసీస్‌దే ఆధిపత్యం ఉండటంతో మ్యాచ్ వారిదేనన్న టాక్ వినపడింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఆసీస్‌కు టీమిండియా దీటైన జవాబిచ్చింది. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు అంతరాయం కలిగినా.. మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ 336 పరుగులకు ఆలౌట్ అయ్యారు. మూడో రోజు ఆటలో 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను శార్దుల్(67), సుందర్(62) ఆదుకున్నారు. ఈ ఇద్దరి జోడీ ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసింది. కేవలం 33 పరుగుల ఆధిక్యంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ పడకుండా 21 పరుగులు చేసింది. వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడింది ఆసీస్. వార్నర్(20 నాటౌట్) జోరుగా ఆడినా... హారీస్ ఒక పరుగుతోనే సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.   


అంతకుముందు, 62/2 స్కోర్ దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా(25), ఆజింక్య రహానే(37), మయాంక్ అగర్వాల్(38), రిషబ్ పంత్(23) అవుట్ అయ్యారు. అయితే టీమిండియా బౌలర్లు సుందర్-శార్దుల్ జోడీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ ఇద్దరి జోరుకు జట్టు స్కోర్ 309 పరుగుల దగ్గర బ్రేక్ పడింది. 103వ ఓవర్ మూడో బంతికి కమిన్స్ బౌలింగ్‌లో శార్దుల్(67) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సైని.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర స్టార్క్ బౌలింగ్‌లో గ్రీన్‌కు సుందర్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా 109 ఓవర్లలో 328 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు జోడించిన తర్వాత సిరాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 

Updated Date - 2021-01-17T19:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising