ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.450కోట్లు పలికిన ప్రపంచ అతిపెద్ద పెయింటింగ్ !

ABN, First Publish Date - 2021-03-24T17:30:39+05:30

బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డార్లకు(రూ. 450కోట్లు) అమ్ముడుపోయి రికార్డుకెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డార్లకు(రూ. 450కోట్లు) అమ్ముడుపోయి రికార్డుకెక్కింది. 'ద జర్నీ ఆఫ్ హుమానిటీ' పేరిట రూపొందించిన ఈ పెయింటింగ్‌ను గీసేందుకు 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ వినియోగించారు జాఫ్రీ. దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో రోజుకు 20 గంటల పాటు సుమారు ఏడు నెలలు కష్టపడి ఈ పెయింటింగ్‌ను గీశారు. కరోనా కాలం మొత్తం దీనిపైనే వెచ్చించినట్లు జాఫ్రీ పేర్కొన్నారు. మొత్తం 70 ముక్కలుగా ఈ పెయింటింగ్ రూపొందింది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నీస్ బుక్‌కెక్కిన ఈ పెయింటింగ్‌ను దుబాయ్ వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి ఏకంగా రూ.450కోట్లకు దక్కించుకోవడం విశేషం.  



Updated Date - 2021-03-24T17:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising