ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వధువును రూ.3లక్షలకు కొనుగోలు చేసిన వరుడు

ABN, First Publish Date - 2021-04-06T13:05:02+05:30

వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు...కాని రూ.3లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన వధువు రెండు వారాల పాటు కాపురం చేసిన తర్వాత ఉడాయించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు వారాలు కాపురం చేసి పరారైన వధువు

జైపూర్ (రాజస్థాన్): వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు...కాని రూ.3లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన వధువు రెండు వారాల పాటు కాపురం చేసిన తర్వాత ఉడాయించిన విచిత్ర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. భరత్ పూర్ జిల్లా నాగ్లామాదర్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాకు చెందిన వధువు సునీత తండ్రికి రూ.3లక్షలు చెల్లించి వివాహమాడారు. వివాహం అనంతరం రెండు వారాలు కాపురం చేసిన సునీత ఇంట్లో ఒంటరిగా వదిలి పనిమీద భర్త నారాయణ్ సింగ్ బయటకు వెళ్లాడు. 


భర్త సింగ్ తిరిగ వచ్చేటప్పటికీ భార్య సునీత ఇంట్లో లేదు. తాను రూ.3లక్షలు చెల్లించి కొని పెళ్లాడిన భార్య సునీత ఇంటి నుంచి పారిపోయిందని భర్త నారాయణ్ సింగ్ అత్తింటివారికి చెప్పారు. సునీత తండ్రి, సోదరుడు ఆమె గురించి తమకు తెలియదని చెప్పడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన భార్యపై భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-04-06T13:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising