ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహేతర సంబంధం కాదు.. ఈ భార్య లక్ష సుఫారీ ఇచ్చి మరీ తన భర్తను ఎందుకు చంపించిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-08-04T20:37:15+05:30

ఆమె లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చి మరీ తన భర్తను చంపించింది.. అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చి మరీ తన భర్తను చంపించింది.. అలాగని ఆమెకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదు.. భర్త పెడుతున్న కష్టాలను భరించలేకే ఆమె ఆ దారుణ నిర్ణయం తీసుకుంది.. రోజూ తాగి వచ్చి తనను కొట్టే భర్తను అంతం చేయాలనుకుంది.. అతడి స్నేహితులతోనే రూ.లక్ష రూపాయలకు బేరం మాట్లాడుకుంది.. ఒప్పందం ప్రకారం వారు అతడిని చంపేశారు.. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం మొత్తం బయటపడింది.. ఛత్తీస్‌గఢ్‌లో సుర్గీలో ఈ ఘటన జరిగింది. 


సుర్గీకి చెందిన దనేష్ సాహూ రోజు తాగి వచ్చి తన భార్య సుర్మీత్‌ను కొడుతుండేవాడు. వారిద్దరి మధ్య ఎప్పుడూ వాదనలు జరుగుతుండేవి. భర్త బతికి ఉంటే తనకు సుఖం ఉండదని భావించిన సుర్మీత్ అతడిని అడ్డు తప్పించాలనుకుంది. అతడి స్నేహితులు నలుగురిని పిలిచి బేరం మాట్లాడుకుంది. దనేష్‌ను చంపితే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అడ్వాన్స్‌గా ఏడు వేలు ఇచ్చింది. 


ఈ నెల 1వ తేదీన దనేష్‌ను పార్టీ అని చెప్పి ఆహ్వానించిన స్నేహితులు అతడికి మద్యం పట్టించి గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని పక్క ఊరిలో పడేశారు. మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. రెండ్రోజుల్లోనే నిందితులు ఎవరో కనిపెట్టేశారు. సుర్మీత్‌ను, అతడిని హత్య చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-08-04T20:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising