ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నూతన దంపతులు ఆనందంగా బుల్లెట్టు బండెక్కారు.. అందాల దునియాని చూసేలోపే ఘోరం జరిగిపోయింది..

ABN, First Publish Date - 2021-11-14T17:39:46+05:30

బీహార్‌లోని ఛాప్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని ఛాప్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. భర్తతో పాటు ఆనందంగా బుల్లెట్లు బండెక్కిన ఆమె రోడ్డు ప్రమాదానికి బలయ్యింది. బీఏ పరీక్షలు రాసేందుకు ఆమె భర్తతో పాటు బండిపై వెళుతుండగా ఒక వాహనం వారి బండిని ఢీకొంది. ఈ ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య కన్నుమూసింది. భర్త రాజీవ్ సంజన్ గాయపడ్డారు. మృతురాలు ప్రియాంకా దేవి(22)  డుమ్రసన్ నివాసి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులంతా అక్కడ గుమిగూడారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజీవ్ సంజన్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రియాంకా దేవి మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని నిర్థారించారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు ఇంకా పట్టుకోలేదు. వాహనంతో పాటు నిందితుడు పరారయ్యాడు. ఈ దంపతులకు పెళ్లియిన ఆరు నెలలకే ఇలా జరగడంపై వారు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన వీరి వివాహాన్ని తలచుకుని కుమిలిపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-11-14T17:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising