Viral Video: ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి రావడానికి ప్రయత్నించిన మహిళ.. సడన్గా కదిలిన రైలు.. ఆ తర్వాత..
ABN, First Publish Date - 2021-11-27T15:55:38+05:30
తొందరపాటు అనేది మనిషి మరణానికి కారణం కావచ్చు.
తొందరపాటు అనేది మనిషి మరణానికి కారణం కావచ్చు. అయితే ఒక్కోసారి మనిషి తొందరపడినప్పటికీ అదృష్టం వారిని బతికించిన సంఘటనలు చూస్తుంటాం. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పట్టాల మధ్యనున్న మహిళ మీదుగా ఒక గూడ్సు రైలు వెళ్లడాన్ని గమనించవచ్చు. ఈ ఉదంతం యూపీలోని బలియా జిల్లాలోని సురెమన్పూర్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో పట్టాల మీదుగా గూడ్సు రైలు వెళుతోంది. దానికింద ఒక మహిళ చిక్కుకుంది. దీనిని గమనించిన అక్కడున్నవారు ఆమె ప్రాణాలను కాపాడారు.
సిగ్నల్ అందని కారణంగా పట్టాలపై నిలిపివున్న ఒక గూడ్సురైలు కింద నుంచి ఒక మహిళ ఆవలివైపునకు త్వరగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఇంతలో ఉన్నట్టుండి గూడ్సు రైలు ముందుకు కదిలింది. పట్టాలపై ఉన్న ఆమెను గమనించిన గేట్మ్యాన్ గట్టిగా అరుస్తూ.. ఆమెను పట్టాలపై పడుకోవాలని సూచించాడు. దీంతో ఆమె అలానే చేయడంతో రైలు ఆమె మీదుగా వెళ్లసాగింది. దీనిని చూసిన అక్కడున్నవారంతా వణికిపోయారు. రైలు వెళ్లిపోయాక ఆమె మెల్లగా లేచి నిలుచుంది.
delhi tak సౌజన్యంతో...
Updated Date - 2021-11-27T15:55:38+05:30 IST