ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న 45 ఏళ్ల మహిళతో.. ఇద్దరు యువకుల సంబంధం.. ఇప్పుడు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2021-11-21T01:49:59+05:30

ఆమెకు ఇపుడు 45ఏళ్లు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా పుట్టిన ఊరిలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా.. అక్రమ సంబంధం వరకూ వెళ్లింది. కొన్నాళ్లపాటు ఆ అక్రమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ఇపుడు 45ఏళ్లు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా పుట్టిన ఊరిలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా.. అక్రమ సంబంధం వరకూ వెళ్లింది. కొన్నాళ్లపాటు ఆ అక్రమ సంబంధం సక్రమంగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ మహిళ ఇచ్చిన షాక్‌కు యువకులకు  దిమ్మతిరిగిపోయింది. కాగా.. ప్రస్తుతం ఆ కుర్రాళ్ల ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాకు చెందిన భాగ్వతి బాయ్‌(45)కి.. ఓ వ్యక్తితో ఇరవై ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఓ బాబు కూడా జన్మించాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఆమె తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. 10ఏళ్లపాటు కుటుంబ సభ్యలతోనే కలిసి ఉన్న ఆమె.. ఆ తర్వాత బతుకు దెరువు కోసం బ్యూటీపార్లర్‌ను నడుపుకుంటూ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు రామ్ సుగ్రీవ్ యాదవ్ (21), అజిత్ (22) పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా.. అక్రమ సంబంధం వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ రోజు భాగ్వతి బాయ్.. అజిత్‌కు షాకిచ్చింది. 



అతడిని డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో కంగుతిన్న అతడు.. అడిగిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. అంతేకాకుండా తనకు డబ్బులు ఇవ్వకుంటే.. విషయం బయటపెడతానని బెదిరించడం ప్రారంభించింది. దీంతో అజిత్ ఆగ్రహానికి లోనయ్యాడు. రామ్ సుగ్రీవ్‌తో కలిసి స్కెచ్ వేశాడు. అక్టోబర్ 27న భాగ్వతి బాయ్ ఇంట్లోకి దూరి, ఆమెను హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి ఆ కుర్రాళ్లు ఇద్దరూ పారిపోయారు. కాగా.. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా రామ్ సుగ్రీవ్, అజిత్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వాళ్లు అసలు విషయం చెప్పేశారు. కుటుంబ సభ్యులకు చెప్తానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆ కుర్రాళ్లపై కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. 




Updated Date - 2021-11-21T01:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising