ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనకు ముగ్గురు... ఇంట్లోనివారికి ఈ సంగతి తెలియడంతో...

ABN, First Publish Date - 2021-09-29T17:13:56+05:30

మన చుట్టుపక్కల, సినిమాల్లో, నవలల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన చుట్టుపక్కల, సినిమాల్లో, నవలల్లో అనేక ప్రేమకథలను చూస్తుంటాం... వింటుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో వెలుగు చూసిన ప్రేమకథను ఎక్కడా వినివుండం. ఈ కథను విన్నవారంతా ఆశ్చర్యంగా నోరెళ్లబెడుతున్నారు. వరుసకు అక్కాచెల్లెళ్లయిన ముగ్గురు యువతులు ఒకే యువకునిపై మనసు పారేసుకున్నారు. ఈ సంగతి వారి ఇళ్లలోని వారికి తెలిసి, వారు వ్యతిరేకించడంతో ఆ ముగ్గురు ప్రియురాళ్లు, ఏకైక ప్రియుడు గ్రామం నుంచి మాయమయ్యారు. 


ఈ ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం అజీమ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం ఇక్కడి ఒక గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి ఇంటిలోని వారికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో ఆ మూడు కుటుంబాల వారు ఆ యువతుల కోసం తమకు అనుమానం ఉన్న అన్నిచోట్లా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే వారు ముగ్గురు కలిసి ఒక యువకునితో పాటు వెళ్లిపోయారని గ్రామంలోని వారికి తెలిసింది. ఆ ముగ్గురు యువతులలో ఇద్దరు మైనర్లని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ముగ్గురు యువతుల కోసం వారి కుటుంబ సభ్యులు ఇంకా గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారమిస్తే ఎక్కడ పరువుపోతుందోననే భయంతో వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఈ ఉదంతం గురించి అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆ ముగ్గురు యువతుల అదృశ్యం గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వారు కంప్లైంట్ చేస్తే తాము వారికి సహకారం అందిస్తామన్నారు.

Updated Date - 2021-09-29T17:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising