ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి బైక్‌పై బయటకెళ్లిన కుర్రాడు.. తెల్లారే కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో టెన్షన్.. 10 కి.మీల దూరంలో..

ABN, First Publish Date - 2021-07-31T16:22:39+05:30

ఆ యువకుడు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బైక్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బైక్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.. ఉదయానికి కూడా తిరిగి రాలేదు.. కాసేపటికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది.. 10 కి.మీ.దూరంలో ఓ బైక్ యాక్సిడెంట్ జరిగిందని, మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆదరాబాదరాగా హాస్పిటల్‌కు పరిగెత్తారు.. అక్కడ కొడుకు మృతదేహం చూసి విలవిలలాడిపోయారు. 


రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన కణరమ్ (20) గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్ తీసుకుని ఇంటి నుంచి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ గుర్తు తెలియని వాహనం అతడిని ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కణరమ్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ యువకుడు అర్ధరాత్రి ఎందుకు బయటకు వచ్చాడు?, అతడిని ఢీ కొట్టిన వాహనం ఏంటి? అనే విషయాల గురించి దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-31T16:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising