ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ తాగడానికని పక్కింటికి వెళ్లిన మహిళను అట్నుంచి అటే జైపూర్ తీసుకెళ్లిపోయారు.. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె చెప్పిందేంటంటే..

ABN, First Publish Date - 2021-12-07T18:05:53+05:30

ఆమె టీ తాగడం కోసమని తమ పక్కింటికి వెళ్లింది.. అక్కడున్న నలుగురితో సరదాగా మాట్లాడుతూ టీ తాగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె టీ తాగడం కోసమని తమ పక్కింటికి వెళ్లింది.. అక్కడున్న నలుగురితో సరదాగా మాట్లాడుతూ టీ తాగింది.. ఆ తర్వాత ఆమెకు ఏం జరిగిందో తెలియలేదు.. కళ్లు తెరిచి చూసే సరికి జైపూర్‌లోని ఓ గదిలో ఉంది.. తనపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుసుకుంది.. తప్పించుకుని ఇంటికి వెళ్లి అక్కణ్నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. 


అజ్మీర్‌కు సమీపంలోని రూప్‌నగర్ గ్రామానికి చెందిన బాధిత మహిళ గత శనివారం తమ పక్కింటికి వెళ్లింది. అక్కడ నేమిచంద్ అనే వ్యక్తి ఆమెకు టీ కలిపి ఇచ్చాడు. అప్పటికే ఆ టీలో మత్తు పదార్థం కలపడం వల్ల దానిని తాగిన మహిళ స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను నేమిచంద్, రామ్‌స్వరూప్, హనుమాన్, గోపాల్ సింగ్ కారులో జైపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఆ నలుగురు రోజంతా అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఆదివారం ఆమెకు స్పృహ వచ్చాక కూడా ఆమెను బలాత్కరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అక్కణ్నుంచి తప్పించుకుని రూప్‌నగర్ తిరిగి వెళ్లిన మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  

Updated Date - 2021-12-07T18:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising