ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను చంపి పేరు మార్చుకుని సిటీలో కొత్త లైఫ్.. నాలుగేళ్ల తర్వాత చేసిన ఒక్క మిస్టేక్‌తో..!

ABN, First Publish Date - 2021-12-17T17:43:00+05:30

అతను నాలుగేళ్ల క్రితం తన భార్యను హతమార్చాడు.. అనంతరం ఆ ఊరి నుంచి పరారయ్యాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను నాలుగేళ్ల క్రితం తన భార్యను హతమార్చాడు.. అనంతరం ఆ ఊరి నుంచి పరారయ్యాడు.. పోలీసులు ఎంతగా వెతికినా దొరకలేదు.. పేరు మార్చుకుని వేర్వేరు నగరాల్లో నివసిస్తుండేవాడు.. అయితే తాజాగా పోలీసులకు దొరికిపోయాడు.. కుటుంబ సభ్యులను చూడాలనే కోరికే అతడిని పోలీసులకు పట్టించింది.. తల్లిదండ్రులను చూసేందుకు గ్రామానికి వచ్చిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


లలిత్‌పూర్‌కు చెందిన మహేష్ లోథి అనే వ్యక్తి 2017 నవంబర్ 24న ఇంట్లో నిద్రపోతున్న తన భార్యను హతమార్చాడు. అదే రోజు రాత్రి ఊరి నుంచి పరారయ్యాడు. రకరకాల పేర్లు మార్చుకుని వేర్వేరు ఊర్లలో నివసించేవాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. మహేష్‌ను పట్టించిన వారికి రూ.25 వేల రివార్డు ప్రకటించారు. అయినా నాలుగేళ్లుగా మహేష్ ఆచూకీ లభించలేదు. 


తన కుటుంబ సభ్యులను కలిసేందుకు మహేష్ రెండ్రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లాడు. అతడిపై రూ.25 వేల రివార్డు ఉండడంతో గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

Updated Date - 2021-12-17T17:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising