కేవలం 15 ఏళ్లకే శాడిస్ట్గా మారిన అబ్బాయి.. అతను ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2021-11-01T13:01:08+05:30
దేశాన్ని, ప్రపంచాన్ని ముందుండి నడిపించాల్సిన యువత పెడదారి పడుతోంది. జీవితంలో త్వరగా అన్నీ అనుభవించాలి.. అనే భావనలో యువతలో కొంతమంది నేరాలకు సైతం పాల్పడుతున్నారు. అలాంటి ఒక ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది...
దేశాన్ని, ప్రపంచాన్ని ముందుండి నడిపించాల్సిన యువత పెడదారి పడుతోంది. జీవితంలో త్వరగా అన్నీ అనుభవించాలి.. అనే భావనలో యువతలో కొంతమంది నేరాలకు సైతం పాల్పడుతున్నారు. అలాంటి ఒక ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
కేరళలోని మళ్లపురానికి చెందిన సబిత(22, పేరు మార్చబడినది) తనపై అత్యాచారం, హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో చెప్పిన వివరాల ప్రకారం..
సబిత కంప్యూటర్ శిక్షణ కోసం తన ఇంటి నుంచి రోజూలాగే బయలుదేరింది. అలా ఆమె వెళుతూ ఉండగా.. దారిలో ఒక నిర్మానుషమైన వీధి ఉంది. ఆ వీధిలో ఆమె వెళుతూ ఉండగా.. వెనుక నుంచి ఎవరో వెంబడించి నట్టు అనిపించింది. వీధి చివరకు వచ్చేసరికి వెనుక నుంచి ఎవరో ఆమెను గట్టిగా తలపై కొట్టారు.
ఆ తరువాత సబితను ఆ దాడి చేసిన వ్యక్తి దెగ్గరలోని పొలంలోకి తీసుకెళ్లాడు. సబిత ఆ వ్యక్తిని గమనించగా అతను ఒక టీనేజర్, సుమారు 15 ఏళ్లు ఉండొచ్చు. అతను సబితను అదుపుచేయడానికి ఆమె చున్నీతో నోటిని కట్టి చితకబాదాడు. ఆ తరువాత తన ప్యాంటుకున్న బెల్టు తీయబోగా.. సబిత పక్కనే ఉన్న రాయిని తీసుకొని అతని తలపై కొట్టి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ప్రస్తుతం సబిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఆస్పత్రిలో పోలీసులు సబత వాంగ్మూలం తీసుకున్నారు.
సబిత జరిగినదంతా వివరంగా పోలీసులకు తన ఫిర్యాదులో చెప్పింది. పోలీసులు తమకు అందిన ఫిర్యాదుమేరకు విచారణ చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవి వీడియోలను పోలీసుల పరిశీలించారు. అందులో ఆ నిందితుడిని సబిత గుర్తించగా పోలీసులు ఎలాగోలా అతడిని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు కరాటే విద్యను అభ్యసించాడని తేలింది.
నిందితుడు ఒక మైనర్ కావడంతో పోలీసులు అతడిని జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో, నిందితుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు.
Updated Date - 2021-11-01T13:01:08+05:30 IST