ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ అదృశ్యం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. ఒకే ఒక్క నిమిషంలో..

ABN, First Publish Date - 2021-07-31T17:45:48+05:30

పట్టపగలు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయమైంది.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టపగలు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయమైంది.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దొంగల పనితీరుకు షాకయ్యారు.. కేవలం ఒక్క నిమిషంలో వారు బైక్‌తో పరారైన తీరు పోలీసులకు కూడా షాకిచ్చింది.. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కోటాలోని సంజయ్ నగర్ ప్రాంతంలో ఇంటి బయట మధ్యాహ్నం పార్క్ చేసిన బైక్‌ను ఇద్దరు దుండగులు దొంగిలించి పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దొంగతనం జరిగిన ఘటన వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దగ్గరకు వచ్చి పరిశీలించారు. అనంతరం ఒక తాళం తీసి హ్యాండిల్ లాక్ తీశారు. కాలినడకన కొంత దూరం బైక్‌ను తోసుకు వెళ్లి అక్కడ ఇంజన్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. ఇదంతా కేవలం ఒకే ఒక్క నిమిషంలో జరిగిపోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-31T17:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising