ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడుపు నొప్పితో మెలికలు తిరిగిన 11 ఏళ్ల బాలిక.. వెంటనే ఆస్పత్రికి తరలింపు.. అక్కడ జరిగింది చూసి కుటుంబ సభ్యులు షాక్!

ABN, First Publish Date - 2021-12-08T17:27:25+05:30

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలిక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలిక.. ఒక శిశువుకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ బాలిక తాను గర్భం దాల్చినప్పటికీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ చెప్పకపోవడం విశేషం. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో దర్యాప్తు ప్రారంభమయ్యింది. ఈ ఘటన ఖెర్వాడా గ్రామంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డిసెంబరు 4న డూంగర్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 


అక్కడ ఆ బాలిక ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు ఆసుపత్రికి చేరుకుని ఆ బాలిక తండ్రి రమేష్, వారి బంధువు రుషభ్ దేవ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన నిందితుడు రుషభ్ దేవ్‌ గుజరాత్‌లో కూలీ పనులు చేస్తుంటాడని, రమేష్‌కు బంధువు అయినందున రుషభ్ దేవ్‌ వారి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉంటుంటాడన్నారు. ఈ నేపధ్యంలో ఆ చిన్నారిని ప్రలోభాలకు గురిచేసి, అత్యాచారం చేశాడు. ఈ కారణంగా  ఆ చిన్నారి గర్భం దాల్చిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T17:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising