ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కిన పాక్ యువకుడు.. అతను ఎందుకు బోర్డర్ దాటాడో తెలిస్తే షాక్..!

ABN, First Publish Date - 2021-12-28T22:45:24+05:30

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల భారత్ సరిహద్దు దాటుతూ భద్రతా దళాలకు చిక్కాడు.. అతడిని అదుపులోకి తీసుకున్న సైన్యం విచారణ ప్రారంభించింది.. అతడు ఎందుకు బోర్డర్ దాటాడో విని షాకైంది.. ముంబైలో ఉన్న తన ప్రేయసిని కలిసేందుకే భారత్‌లోకి ప్రవేశించానని ఆ యువకుడు చెప్పాడు.. దీంతో సైన్యం అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తోంది.. రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతం శ్రీ గంగానగర్‌‌లో ఈ ఘటన జరిగింది. 


పాకిస్థాన్‌లోని హసిల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆమిర్‌(22)అనే యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ముంబైకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆమెను నేరుగా కలవాలనుకున్నాడు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతను అక్రమంగా సరిహద్దు దాటాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సైన్యం చేతికి చిక్కాడు. 


సరిహద్దు భద్రతా దళానికి చెందిన పెట్రోలింగ్ బృందం ఆ యువకుడిని పట్టుకున్నప్పుడు అతడి వద్ద మొబైల్ ఫోన్, కొన్ని కరెన్సీ నోట్లు మాత్రమే ఉన్నాయి. ఆమిర్ చెప్పిన వివరాలు నిజమా? కాదా? అని భద్రతా సంస్థలు విచారణ ప్రారంభించాయి. విచారణ పూర్తయ్యాకే అతడిపై చర్యలు తీసుకుంటామని  ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-28T22:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising