ఏకంగా 14 పిల్లలకు జన్మనిచ్చిన 25 ఏళ్ల మొసలి
ABN, First Publish Date - 2021-06-19T22:39:29+05:30
ఏకంగా 14 పిల్లలకు జన్మనిచ్చిన 25 ఏళ్ల మొసలి
చెన్నై: ఒక ముసలి ఏకంగా 14 పిల్లలకు జన్మనిచ్చింది. తమిళనాడు కోయంబత్తూరులోని జంతు ప్రదర్శనశాలలో ఈ అరుదైన ఘటన జరిగింది. చెన్నై జూలో కరోనా భయం నెలకొన్నప్పటికీ కోయంబత్తూరు జూలో మాత్రం జీవాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఈ సమయంలోనే 25 ఏళ్ల ముసలి ఏకంగా 14 పిల్లలకు తల్లి అయింది. నిజానికి అది చాలా గుడ్లు పెట్టింది. అందులో 14 పిల్లలయ్యాయి. అవి ఆడుకుంటూ ఉంటే చూసేందుకు జూ సిబ్బంది పోటీ పడుతున్నారు. కరోనా నియమాల కారణంగా సందర్శకులు వచ్చే అవకాశం లేకపోవడంతో మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2021-06-19T22:39:29+05:30 IST