ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్న భర్త!

ABN, First Publish Date - 2021-08-26T11:48:51+05:30

ఒడిశాలోని కాలాహండీ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలాహండీ: ఒడిశాలోని కాలాహండీ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చితిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన గోలాముండా బ్లాక్ పరిధిలోని సియాల్జోడీ గ్రామంలో చోటుచేసుకుంది. భార్యకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వృద్ధుడైన భర్త పరుగుపరుగున వెళ్లి, ఆ చితిలో దూకాడు. 


అగ్ని కీలలు పెద్దగా ఎగసిపడుతుండటంతో అక్కడున్నవారెవరూ ఆ వృద్ధుడిని కాపాడే సాహసం చేయలేకపోయారు. వారంతా చూస్తుండగానే ఆ వృద్ధుడు అగ్నికి ఆహుతైపోయాడు. మృతుడిని నీలమణి సబర్‌గా పోలీసులు గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమణి సబర్ భార్య రాయబరీ సబర్(60) కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తన నలుగురు కొడుకులు, ఇంటి చుట్టుపక్కలవారితో పాటు స్మశాన వాటికకు నీలమణి సబర్ వెళ్లాడు. అక్కడ మృతురాలి చితికి నిప్పంటించారు. తరువాత ఆ వృద్ధుని కుమారులు, ఇంటి చుట్టుపక్కలవారు సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీలమణి సబర్ భార్య చితిని చూస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇంతలోనే ఏమనున్నాడో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చితిలో దూకేశాడు. అక్కడున్నవారు పరిస్థితిని అర్థం చేసుకునే లోగానే ఆ వృద్ధుడు చితి మంటలకు బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2021-08-26T11:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising