ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్ ప్రేమ.. అమెరికా నుంచి వచ్చి మరీ ఓ కుర్రాడితో పెళ్లి.. లాడ్జిలోనే కాపురం.. చివరకు ఊహించని ట్విస్ట్..

ABN, First Publish Date - 2021-07-30T20:57:27+05:30

ఆమెది అమెరికాలోని న్యూయార్క్.. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెది అమెరికాలోని న్యూయార్క్.. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్.. ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. ఆమె న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చి అతడిని పెళ్లి చేసుకుంది.. ఓ వారం రోజులూ ఇద్దరూ లాడ్జిలో కాపురం చేశారు.. అనంతరం న్యూయార్క్ వెళ్లిన ఆమెకు అసలు విషయం తెలిసింది.. అతడికి ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. 


మీరట్‌కు చెందిన నదీమ్ న్యూయార్క్ యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఆమెను ప్రేమలోకి దించాడు. నదీమ్‌ ప్రేమను నిజమని నమ్మిన ఆ యువతి అతడి కోసం దాదాపు రూ.14 లక్షలు ఖర్చు పెట్టింది. కారు, బైక్, బంగారం కోసం అంటూ తరచుగా డబ్బులు పంపేది. ఒకరోజు న్యూయార్క్ నుంచి మీరట్ వచ్చి అతడిని పెళ్లి చేసుకుంది. అక్కడే ఓ లాడ్జిలో ఇద్దరూ కలిసి ఉన్నారు. అనంతరం ఆమె న్యూయార్క్ వెళ్లిపోయింది. 


కొన్ని రోజుల అనంతరం నదీమ్ మీద ఆమెకు అనుమానం వచ్చింది. పరిశోధన చేయగా నదీమ్‌కు అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆమె భారత్‌కు వచ్చి ఇండియా గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు.  

Updated Date - 2021-07-30T20:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising