ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రెండున్నరేళ్ల చిన్నారి నవ్వును చూస్తే చాలు.. ఎన్ని కష్టాలయినా మర్చిపోవచ్చు.. కానీ ఈ తల్లి ఇలా చేసిందేంటి..!

ABN, First Publish Date - 2021-12-20T17:55:02+05:30

రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని ఒక వివాహిత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని ఒక వివాహిత తన రెండున్నరేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఆత్మహత్యకు జైపూర్‌కు చెందిన ఒక  మహిళా పట్వారీనే కారణమని ఆరోపించింది. తన ఆత్తామామల ప్రమేయం లేదని ఆడియోలో స్పష్టం చేసింది. వైరల్‌గా మారిన ఈ ఆడియో స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, ఆ  మహిళా పట్వారీ గురించి ఆరా తీస్తున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బల్వానా ప్రాంతానికి చెందిన ప్రకాశ్ దేవి తన రెండున్నరేళ్ల కుమార్తె ఆర్యతో సహా వాటర్ ట్యాంకులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త అశోక్ కుమార్.. సాంచౌర్‌లో పట్వారీగా పనిచేస్తున్నాడు. రండు రోజుల క్రితం కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని  ప్రకాశ్ దేవి ఒక ఆడియోను రికార్టు చేసి, దానిని వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది. ఆ తరువాత కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. 19 సెకెన్లున్న ఆ ఆడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-20T17:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising