ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నల్ లేదని 50 అడుగుల ఎత్తులో.. ఉయ్యాల కట్టుకొని కూర్చుంటున్న మంత్రి!

ABN, First Publish Date - 2021-02-22T09:38:33+05:30

మొబైల్ నెట్‌వర్క్ సరిగా రావడం లేదని ఓ మంత్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారో తెలుసా? ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల కట్టుకొని దానిలో కూర్చొని పని చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మొబైల్ నెట్‌వర్క్ సరిగా రావడం లేదని ఓ మంత్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏం చేశారో తెలుసా? ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల కట్టుకొని దానిలో కూర్చొని పని చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ మొబైల్‌కు నెట్‌వర్క్ సరిగా రాలేదు. దీంతో ఆయన ఓ 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నారు. ఆంఖో గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఉయ్యాల ఎక్కి ఆయన పని చేయడం ఇది తొలిసారేమీ కాదు. గత తొమ్మది రోజులుగా ఆయన ఇదే పని చేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 3 గంటలపాటు ఉయ్యాల్లో కూర్చొని పని చేసి తిరిగి వెళ్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-02-22T09:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising