ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన స్థలంలో మూత్రం పోశారని.. సోదరుడి కొడుకులపై ఘాతుకం.. తుపాకీ తీసుకొచ్చి..

ABN, First Publish Date - 2021-11-22T22:04:07+05:30

వాళ్లిద్దరూ రక్తం పంచుకుపుట్టిన సోదరులు.. ఇద్దరి మధ్య భూమి విషయమై వివాదం తలెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాళ్లిద్దరూ రక్తం పంచుకుపుట్టిన సోదరులు.. ఇద్దరి మధ్య భూమి విషయమై వివాదం తలెత్తింది.. స్థల వివాదం విషయంలో ఇద్దరూ కోర్టుకు వెళ్లారు.. సోమవారం ఉదయం ఆ వివాదాస్పద స్థలం గురించి మరోసారి గొడవ జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరూ సోదరులు హోరాహోరీ తలపడ్డారు.. ఫలితంగా ఒక సోదరుడి కుమారుడు ప్రాణం కోల్పోయాడు..  మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో ఈ ఘటన జరిగింది. 


ప్రయోగరాజ్‌కు చెందిన దినేష్ శుక్లా, నీలూ శుక్లా అనే సోదరుల మధ్య  ఓ స్థలం విషయంలో చాలా రోజుల కిందట వివాదం నెలకొంది. ఆ స్థలం తనదంటే తనదని సోదరులిద్దరూ కోర్టుకు వెళ్లారు. సోమవారం ఉదయం ఆ వివాదాస్పద స్థలంలో దినేష్ శుక్లా పిల్లలు దీపక్ శుక్లా, వైభవ్ శుక్లా మూత్ర విసర్జన చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నీలూ శుక్లా గొడవకు దిగాడు. ఇరు వైపుల వాళ్లు కత్తులు, కర్రలు తీసుకుని బయల్దేరారు. 


ఆ గొడవలో ఆగ్రహానికి గురైన నీలూ శుక్లా సోదరుడి పిల్లలపై కాల్పులు జరిపాడు. దీపక్ శుక్లా, వైభవ్‌ శుక్లా ఆ కాల్పుల కారణంగా నేలకొరిగారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దీపక్ చనిపోగా.. వైభవ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం వైభవ్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హత్యకు పాల్పడిన నీలూ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2021-11-22T22:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising