ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతనికి తన భార్య నచ్చలేదు.. ముగ్గురు స్నేహితులను పిలిచి అతను ఎంతకి తెగించాడంటే..

ABN, First Publish Date - 2021-11-22T18:16:32+05:30

అతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు.. అయితే అతనికి తన భార్య నచ్చలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు.. అయితే అతనికి తన భార్య నచ్చలేదు.. అందంగా లేదని ఆమెను హింసించడం ప్రారంభించాడు.. ఆమెతో సఖ్యంగా ఉండేవాడు కాదు.. ఇటీవల తన సోదరితో కలిసి అతను దారుణానికి పాల్పడ్డాడు.. తన స్నేహితులకు తన భార్యను అమ్మేశాడు.. వారు ఆమెను వేరే ఊరికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కోటకు సమీపంలోని బుండి ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తండ్రి ఈ నెల 3వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. తన కూతురిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశానని, అతడే తన కూతురిని వేరే వారికి అమ్మేశాడని కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ఆమెను కనిపెట్టారు. ఆమె నుంచి నిజాలు తెలుసుకున్నారు. 


తన భర్త రాకేష్, వదిన ప్రియ తనను తరచుగా హింసించేవారని, ఈ నెల మూడో తేదీన తనను ముగ్గురు వ్యక్తులకు అమ్మేశారని బాధిత మహిళ చెప్పింది. వారు తనను దెవ్లీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచారని, కొన్ని రోజుల పాటు ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అనంతరం అదే ఊరిలో వేరే ఇంటికి మార్చారని, ఆ సమయంలో తనకు ఫోన్ దొరకడంతో తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పానని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్, ప్రియను అదుపు లోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల గురించి గాలిస్తున్నారు.   


Updated Date - 2021-11-22T18:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising