ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకుల్ చేతిపై పచ్చబొట్టు.. తన తల్లి పేరే అని తెలిసి 20 ఏళ్ల ఆ కుర్రాడు నిలదీస్తే షాకింగ్ నిజాలు.. చివరకు..

ABN, First Publish Date - 2021-07-30T21:43:00+05:30

నాలుగు రోజుల క్రితం బాబాయ్ ఊరికొచ్చాడు. దీంతో రాజ్ అగ్రవాల్ చాలా సంతోషించాడు. వీళ్లిద్దరూ కలిసి అండమాన్‌లో పనిచేసే వారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: నాలుగు రోజుల క్రితం బాబాయ్ ఊరికొచ్చాడు. దీంతో రాజ్ అగ్రవాల్ చాలా సంతోషించాడు. వీళ్లిద్దరూ కలిసి అండమాన్‌లో పనిచేసే వారు. మూడు నెలల క్రితం రాజ్ స్వగ్రామానికి వచ్చాడు. ఇదిగో ఇప్పుడు అతని బాబాయ్ శశి అగ్రవాల్ అక్కడకు వచ్చాడు. మరో రెండ్రోజుల్లో ఇద్దరూ కలిసి అండమాన్ వెళ్లిపోవాలి. కానీ అనుకోని ఘటన జరగడంతో వీరిద్దరి జీవితాలూ తలకిందులైనాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శశి ఇల్లు ఉంది. గురువారం రాత్రి శశి ఇంట్లోనే బాబాయ్-అబ్బాయ్ జోడీ మందు కొట్టడం ప్రారంభించింది. ఇద్దరూ ఫుల్లుగా మందు కొట్టి మత్తులో ఊగిపోతున్నారు. ఇలాంటి సమయంలో బాబాయ్ చేతిపైన ఉన్న ఒక టాటూ రాజ్ కంటపడింది. కొన్ని ఇంగ్లీష్ అక్షరాల మధ్య తన తల్లి పేరుండటంతో రాజ్ ఆశ్చర్యపోయాడు. ఏంటిది? అంటూ శశిని నిలదీశాడు. 


మద్యం మత్తులో ఉన్న శశి అసభ్యంగా మాట్లాడాడు. కొన్ని షాకింగ్ నిజాలను రాజ్‌కు చెప్పాడు. దీంతో తన తల్లికి, బాబాయ్‌కి అక్రమ సంబంధం ఉందేమో అని రాజ్‌కు గట్టిగా అనుమానం వచ్చింది. అంతే పక్కనే ఉన్న ఇనుప రాడ్ తీసుకొని బాబాయ్ తల పగలగొట్టేశాడు. అక్కడితో ఆగకుండా ఒక తీగను బాబాయ్ మెడ చుట్టూ బిగించి చంపేశాడు. ఆ రాత్రి మొత్తం యూట్యూబ్ వీడియోలు చూస్తూ బాబాయ్ శవం పక్కనే గడిపేశాడు. ఉదయాన్నే తన మిత్రుడికి ఫోన్ చేసి ఒక కారు అద్దెకు తీసుకున్నాడు. యూట్యూబ్‌లో చూసినట్లే బాబాయ్ శశి శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా కారులో ఆ శవాన్ని పెట్టుకొని సాయంత్రం వరకూ తిరిగారు. ఆ తర్వాత ఊరు చివరకు వెళ్లి నాలుగడుగుల గొయ్యి తవ్వి, దానిలో శవాన్ని పూడ్చిపెట్టారు. వీళ్లు చేస్తున్న పనిని చూసిన కొందరు గ్రామస్థులు చుట్టుముట్టడంతో రాజ్ మిత్రులు ఇద్దరు పారిపోయారు. మిగతా ఇద్దరు తాము యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నామంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం తీరకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ యువకులు చేసిన ఘాతుకం బయటపడింది. 

Updated Date - 2021-07-30T21:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising