ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయాడనుకున్న వ్యక్తి... 3 నెలల తరువాత తిరిగొచ్చాడు!

ABN, First Publish Date - 2021-03-30T17:54:16+05:30

చనిపోయాడనుకున్న ఒక వ్యక్తికి అతని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పతనంతిట్ట: చనిపోయాడనుకున్న ఒక వ్యక్తికి అతని కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఊహించని విధంగా మూడు నెలల తరువాత ఆ వ్యక్తి కుటుంబీకుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదంతం కేరళలోని పతనంతిట్ట పరిధిలోని కుదస్సనాడులో చోటుచేసుకుంది. తిరువనంతపురంలో సాబూ చిన్నాచితకా పనులు చేసేవాడు. ఒక హోటల్‌లో పనిచేస్తున్న సాబూను చోరీ కేసులో పోలీసులు గత ఏడాది నవంబరులో అరెస్టు చేశారు. ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియదు. ఇదిలావుండగా 2021, డిసెంబర్‌ 24న కొట్టాయం జిల్లాలోని పాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 


అయితే ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు తిరువనంతపురం పోలీసులు తెలిపారు. దీంతో ఆ మృత దేహానికి  సాబూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన మూడు నెలల తరువాత ఒక బస్‌ డ్రైవర్‌కు సాబూ ఎదురయ్యాడు. దీంతో ఈ విషయాన్ని అతను పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో సాబూ కుటుంబ సభ్యులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. కాగా సాబూ కుటుంబ సభ్యులు గతంలో అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-03-30T17:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising