ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా సీజ‌న్‌: క‌ర్ర‌ల‌తో వ‌ధూవ‌రులు ఇలా...

ABN, First Publish Date - 2021-05-03T13:19:33+05:30

బీహార్‌లోని బెగుస‌రాయ్‌లో క‌రోనా సీజ‌న్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెగుస‌రాయ్‌: బీహార్‌లోని బెగుస‌రాయ్‌లో క‌రోనా సీజ‌న్‌లో కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ, జ‌రిగిన వివాహం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెళ్లిలో వ‌ధూవ‌రులు సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్ర‌తీ తంతూ పూర్తిచేశారు. ముఖ్యంగా దండ‌లు మార్చుకునే కార్య‌క్ర‌మం అత్యంత విచిత్రంగా జ‌రిగింది. ఈ సోష‌ల్ డిస్టెన్స్ మ్యారేజ్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 


క‌రోనా కాటుకు గురి కాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవడం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించడం త‌ప్ప‌నిస‌రి. అందుకే ఈ నియ‌మాల‌ను పాటిస్తూ వ‌ధూవ‌రులిద్ద‌రూ చెరో రెండు క‌ర్ర‌లు తీసుకుని, వాటికి దండ‌లు త‌గిలించి పర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ సందర్భంగా వ‌రుడు మాట్లాడుతూ సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ, జ‌రిగిన ఈ వివాహం త‌మ‌కు జీవితాంతం గుర్తుండిపోతుంద‌న్నారు. క‌ర్ర‌ల‌తో దండ‌లు మార్చుకునే తంతు ఎంతో న‌చ్చింద‌న్నారు. కాగా ఈ వివాహానికి 50 మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈ క‌రోనా సీజ‌న్ వివాహం బీహార్‌లోని తెఘ్డా ప‌రిధిలోని తెఘ్రా బజార్‌లో జ‌రిగింది. ఏప్రిల్ 30న కృతేష్ కుమార్, జ్యోతిల వివాహంలో ఈ దృశ్యాలు క‌నిపించాయి.

Updated Date - 2021-05-03T13:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising