ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్లాట్ ఫాంపై రూ.లక్ష పోగొట్టుకున్న కూలీ.. తిరిగిచ్చిన కానిస్టేబుల్

ABN, First Publish Date - 2021-07-05T11:53:52+05:30

ఓ ఢిల్లీ పోలీస్ తనలోని మానవత్వాన్ని, తన డ్యూటీలోని సిన్సియారిటీని నిరూపించుకున్నాడు. ఓ ప్రయాణికుడు మరచిపోయిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఓ ఢిల్లీ పోలీస్ తనలోని మానవత్వాన్ని, తన డ్యూటీలోని సిన్సియారిటీని నిరూపించుకున్నాడు. ఓ ప్రయాణికుడు మరచిపోయిన రూ.1లక్ష బ్యాగును తిరిగి అతడికి అందించాడు. వివరాల్లోకి వెళితే.. 53ఏళ్ల విజయ్ కుమార్ అనే కూలీ ఓ బ్యాగ్‌లో రూ.లక్ష పెట్టుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అయితే అనుకోకుండా ఆ బ్యాగ్ పోగొట్టుకుని వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్ అక్కడి కానిస్టేబుల్ నరేందర్ కుమార్ కంట పడింది. నరేందర్ వెంటనే ఆ బ్యాగ్‌‌ను పూర్తిగా చెక్ చేశాడు. అందులో విజయ్ ఆధార్ కార్డు, ఇతర వస్తువులు దొరికాయి. వాటి ద్వారా విజయ్ అడ్రస్ తీయించాడు. అతడిని స్టేషన్‌కు పిలిపించి వెళ్లి ఆ సొమ్మును తిరిగిచ్చేశాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందపడిన విజయ్ కుమార్ ‘‘నేను ఈ డబ్బు తిరిగొస్తుందనే ఆశలన్నీ వదులుకున్నా. కానీ నరేందర్ బాబు నన్ను ఎన్నో కష్టాల నుంచి కాపాడిన దేవుడు’’ అంటూ కొనియాడాడు.

Updated Date - 2021-07-05T11:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising