ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయంలో Diwali celebrationకు పాక్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్

ABN, First Publish Date - 2021-11-08T14:29:05+05:30

మైనారిటీ హిందూ సమాజానికి సంఘీభావం తెలపడానికి వీలుగా పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ ప్రాంతంలోని తేరీ ఆలయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: మైనారిటీ హిందూ సమాజానికి సంఘీభావం తెలపడానికి వీలుగా పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ ప్రాంతంలోని తేరీ ఆలయంలో జరగనున్న దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ దేవాలయంపై గత సంవత్సరం కొంతమంది దుండగులు దాడి చేసి కూల్చివేశారు.పాక్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దీపావళి వేడుకలో పాల్గొంటారని పాక్ హిందూ కౌన్సిల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆలయం ఒక సాధువు శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ మందిరం. ఈ ఆలయాన్ని 1920 సంవత్సరంలో నిర్మించారు.


గత ఏడాది డిసెంబరులో జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్‌కు చెందిన స్థానిక మతగురువు నేతృత్వంలోని గుంపు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఆలయ సమీపంలో జరిగిన జమియాత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ ర్యాలీ తర్వాత ఈ సంఘటన జరిగింది. కూల్చివేసిన ఈ మందిరాన్ని పునరుద్ధరించాలని గతంలో సీజేపీ గుల్జార్ అహ్మద్ ఆదేశించారు. గత నెలమందిరాన్ని ధ్వంసం చేసిన నిందితుల నుంచి రూ.33 మిలియన్లను (పాకిస్థానీ రూపాయలు) రికవరీ చేయాలని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వాన్ని గుల్జార్ అహ్మద్ ఆదేశించారు.


Updated Date - 2021-11-08T14:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising