ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది క్రితమే ఇద్దరికీ పెళ్లి నిశ్చయం.. మధ్యలో ఓ యువతి ఎంట్రీ.. చివరకు జరిగిన ఘోరమిది

ABN, First Publish Date - 2021-08-04T17:32:11+05:30

ఏడాది క్రితమే వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మధ్యలో మరో యువతి రావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది క్రితమే వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మధ్యలో మరో యువతి రావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.. తాజాగా వారిద్దరూ అడవిలోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు.. దీంతో ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.. అక్కడకు డాగ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.. గుజరాత్‌లోని అరవిల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


శ్యామలాజీ గ్రామానికి చెందిన సంజీవ్‌కు, వాడ్ గ్రామానికి చెందిన సన్యాబెన్‌కు గతేడాది నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత మరో యువతితో సంజీవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. వరుడిపై వధువు తండ్రి కేసు కూడా పెట్టాడు. అయితే సంజీవ్‌ అంటే బాగా ఇష్టపడిన సన్యాబెన్ అతడిని తప్ప వేరొకరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడలేదు. కేసులు, ఇరు కుటుంబాల మధ్య గొడవలతో ఈ పెళ్లి సాధ్యం కాదని తేలడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సమీపంలోని అడవికి వెళ్లి ఓ చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2021-08-04T17:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising