ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్.. ఇదేం కేసు.. రాత్రిళ్లు కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడట.. కేసు పెట్టిన మహిళ

ABN, First Publish Date - 2021-06-25T01:34:49+05:30

క్షుద్ర పూజలు చేసే ఓ వ్యక్తి తనపై కలలో తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బీహార్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ మాంత్రికుడు తనపై కలలో తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బీహార్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. బీహార్‌లోని గాంధీ మైదాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమారుడు గతేడాది చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమె ఈ ఏడాది జనవరిలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని కలిసి తన కొడుకు అనారోగ్యం గురించి వివరించింది.


సదరు మాంత్రికుడు ఆ మహిళ కుమారుడు కోలుకునేందుకు కొన్ని పూజలు చేశాడు. అయితే ఆ తర్వాత 15 రోజులకే ఆమె కుమారుడు మరణించాడు. దీంతో ఆమె చతుర్వేది ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. ఆ సమయంలో చతుర్వేది తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అప్పుడు తన కుమారుడు వచ్చి రక్షించాడని,  ఆ తర్వాత చతుర్వేది పలుసార్లు కలలోకి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ స్థానిక కుద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చతుర్వేదిని విచారించారు. అయితే ఆ మహిళను ఇప్పటివరకు తను ఒక్కసారి కూడా చూడలేదని చతుర్వేది పోలీసులకు చెప్పాడు. చతుర్వేదికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో బాండ్‌పై సంతకం చేయించుకుని పోలీసులు అతడిని వదిలేశారు.  


Updated Date - 2021-06-25T01:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising