ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు పట్టాల మధ్యలో పక్షి గూడు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్!

ABN, First Publish Date - 2021-11-24T17:28:06+05:30

తన వ్యాపార విషయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగినంత సమయం కేటాయిస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన వ్యాపార విషయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగినంత సమయం కేటాయిస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తనకు ఆసక్తికరంగా అనిపించిన అంశాలను ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఇటీవల ఓ ఏనుగు వీడియోను షేర్ చేసి భారత ఆర్థిక వ్యవస్థ గురించి కామెంట్ చేసిన ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ పక్షికి సంబంధించిన వైరల్ ఫొటోను షేర్ చేశారు. 


ఓ చిన్న పక్షి రైలు పట్టాల మధ్య గూడు నిర్మించుకుంది. తరచుగా రైళ్లు రాకపోకలు సాగించే పట్టాలపై అత్యంత ప్రమాదకర స్థలంలో ఆ పక్షి గూడు నిర్మించుకుంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా `ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఈ పక్షిని చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు పోటీ పడతాయ`ని కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 



Updated Date - 2021-11-24T17:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising