ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో.. కడుపునొప్పి అంటూ ఏడుస్తూ ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలిక.. స్కానింగ్‌ చేసి డాక్టర్లు చెప్పిన నిజాన్ని విని..

ABN, First Publish Date - 2021-10-23T21:54:20+05:30

16ఏళ్ల బాలిక ఉన్నట్టుండి కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆమెకు అపెండిక్స్ అని తేల్చేశారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్లాల్సింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: 16ఏళ్ల బాలిక ఉన్నట్టుండి కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆమెకు అపెండిక్స్ అని తేల్చేశారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వైద్యులు సూచించినట్టుగానే కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరదు 16ఏళ్ల బాలికకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. కుటుంబ సభ్యులకు గుండెలదిరే వార్తను చెప్పారు. ఈ క్రమంలోనే రంగంలోకి పోలీసులు దిగారు. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలికకు ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం దగ్గరలో ఉన్న ఓ చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. అపెండిక్స్‌గా తేల్చేసి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెను జోధ్‌పూర్‌లో ఉన్న ఓ పెద్ద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ బాలికకు ఆపరేషన్ చేయడం కోసం వైద్య పరీక్షలు చేసి, డాక్టర్లు షాకయ్యారు. 



ఆ 16ఏళ్ల బాలిక రెండు నెలల గర్భవతి అని గుర్తించి వైద్యులు కంగుతిన్నారు. ఈ క్రమంలోనే ఆ బాలికకు అపెండిక్స్ శస్త్రచికిత్సను చేసి, ప్రెగ్నెన్సీ విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులకు రంగంలోకి దిగారు. ఆపరేషన్ వల్ల అపస్మారక స్థితిలో వెళ్లిన బాలిక.. అక్టోబర్ 20న కళ్లు తెరవడంతో పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలో శోభ్ సింగ్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు ఆ బాలిక చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో, ఎస్సీ-ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. 


Updated Date - 2021-10-23T21:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising