ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి వేళ బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు.. 10నిమిషాల తర్వాత విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్..

ABN, First Publish Date - 2021-11-28T23:48:38+05:30

అదో ప్రవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు. ప్రయాణికులతో ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో రాత్రి వేళ.. బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అదో ప్రవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు. ప్రయాణికులతో ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో రాత్రి వేళ.. బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకు శబ్దాలకు గల కారణం ఏంటో తెలసుకుని షాక్ అయ్యారు. కాగా..  ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



కొందరు ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఆ బస్సు శనివారం అహ్మాదాబాద్ పరిసర ప్రాంతానికి చేరుకుంది. రాత్రి సమయం కావడంతో రోడ్డు పక్కన ఉన్న దాబా వద్ద డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో ప్రయాణికులు దాబాలో భోజనం చేసి, తిరిగి బస్సెక్కారు. ఈ నేపథ్యంలో బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత.. వింత శబ్దాలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. ఆ తర్వాత 10 నిమిషాలకే బస్సులో 14 అడుగుల కొండ చిలువ కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. చాకచక్యంగా ఆ కొండ చిలువను పట్టుకుని దాన్ని అడవిలో విడిచిపెట్టారు. దీంతో మిగిలిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 




Updated Date - 2021-11-28T23:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising